మహబూబ్నగర్ : జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామరాజు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, ఆర్డీవో అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, అర్బన్ తహసీల్దార్ విద్యాసాగర్, టీఎస్ఐఎండీసీ ఈఈ జైపాల్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. పౌర సరఫరాలు, జాతీయ రహదారులు, పునరావాసం, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.