మహబూబ్ నగర్ : స్వచ్ఛమైన, ఆరోగ్యమైన నీరాతో పాటు కులవృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 75 లక్షల చెట్లను నాటినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన భూత్పూర్ మండల కేంద్రం సమీపంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కులవృత్తులతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, డైమండ్ చెట్లను నాటుతున్నామని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 75 లక్షల మొక్కలను నాటినట్లు మంత్రి వివరాలను వెల్లడించారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే కోట్లాది మొక్కలను పెంచుతున్నదని పేర్కొన్నారు. జిల్లాలో కరివేన రిజర్వాయర్ వద్ద 10 ఎకరాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కింద మొక్కలు పెడుతున్నామని, ముఖ్యంగా ఈత మొక్కలను ఒక్క గౌడ కులస్తులే కాకుండా తక్కినవారు కూడా పెట్టేందుకు ముందుకు రావాలన్నారు.
రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కాలువ పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, డిప్యూటీ కమిషనర్ దత్తరాజ్ గౌడ్, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, ఎంపీపీ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన