Minister Srinivas Goud | సిరిసిల్ల అంటేనే నేతన్న, గీతన్న అని.. ఇద్దరికీ అవినావభావ సంబంధం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో నేత, గీత కార్మికులు అష్టకష్టాలు పడ్డ నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. నాగరికత నేర్పిన వృత్తులు, కుల వృత్తులు స్వరాష్ట్రం తెలంగాణలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. సిరిసిల్లలో సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి కేటీఆర్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కల్లులో అనేక ఔషధాలు ఉన్నాయని, అందుకే అమృతం అంటారన్నారు. అనేక చోట్ల రెండు గ్లాస్ల విధానం ఉన్నా.. కల్లు కాంపౌండ్లో రెండు గ్లాస్ల పద్ధతి ఉండేది కాదన్నారు.
గౌడ కులస్తులు తమ వృత్తిని గౌరవించాలని, సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తులకు సమాన గౌరవం ఇచ్చి ఆదరించారన్నారు. హైదరాబాద్లో నీరాను విక్రయించేందుకు నీరా కేప్ ఏర్పాటు చేశామని, బెంజ్ కార్లలో వచ్చి ధనికులు కూడా కేఫ్లో నీరా తాగుతున్నారన్నారు. 70వేల గీత కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని, వైన్షాపుల్లో 15శాతం రిజ్వేషన్లను కేటాయించారని, సమైక్య రాష్ట్రంలో జానెడు జాగా అడిగితే రూల్స్ చెప్పారని, ఇప్పుడు అన్ని కులాలకు విలువైన జాగాలు ఇచ్చారన్నారు. కేటీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సిరిసిల్ల అంటే ఇక్కడి ప్రజలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా గౌరవం ఉంటుందని, కుల మత బేధం లేకుండా అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సేఫ్టీ మోకాలు త్వరలోనే అందజేస్తామన్నారు. ట్యాంక్బండ్పై రూ.3కోట్లతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ వారసులుగా మేలు చేసిన వ్యక్తుల వెన్నంటే ఉంటామన్నారు. కులవృత్తుల అందరి డీఎన్ఏ ఒక్కటేనని, రాబోయే మూడేళ్లలో సినిమాలు అన్ని తెలంగాణ పల్లెల్లోనే తీస్తారన్నారు. ఆధ్యాత్మికత, టూరిజానికి తెలంగాణ కేంద్రం బిందువు కానుందన్నారు. గౌడ జాతికి ఇప్పటికీ సీఎం కేసీఆర్ ఎంతో చేశారన్నారు. భవిష్యత్లో మరెంతో చేస్తారని, ఎంతో మేలు చేసిన ప్రభుత్వానికి గౌడన్నలు అండగా ఉండాలన్నారు.