మక్తల్ టౌన్, జూన్ 18: కర్ణాటక, గోవా రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం రాకుండా అడ్డుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెక్పోస్టు సిబ్బందిని ఆదేశించా రు. ఆదివారం ఆయన రాయిచూర్ నుంచి మహబూబ్నగర్ వెళ్తూ నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కృష్ణ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఎక్సైజ్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్లారంటూ నిలదీశా రు. ఎక్సైజ్, విజిలెన్స్ నిఘా సరిగ్గాలేదని.. ఇలా అయితే అక్రమంగా వచ్చే మద్యానికి అడ్డుకట్ట ఎలా వేస్తారని ప్రశ్నించారు. సిబ్బంది సరిగ్గా పనిచేయకపోతే రాష్ర్టానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుందని అన్నారు. సిబ్బంది పొరపాట్లు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయిచూర్ నుం చి మక్తల్ వైపు వెళ్తున్న వాహనాలను మంత్రి తనిఖీ చేశారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద సిబ్బందిని పెంచాలని ఎక్సైజ్ కమిషనర్ను ఆదేశించారు.