మహబూబ్ నగర్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎక్సైజ్, స్పోర్ట్స్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని హన్వాడ మండలం యర్రోనిపల్లి గ్రామంలో చెంచు గిరిజనుల కోసం రూ. 1 కోటి 27 లక్షల రూపాయలతో 24 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా చెంచు సోదరీమణులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేశారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.