Minister Srinivas Goud | రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు( BRS Activist ) అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతటి ప్రాధాన్యమిస్తారో మరోసారి నిరూపితమైంది.
మహబూబ్నగర్ జిల్లా( Mahabubnagar Dist ) కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనానికి మహబూబ్నగర్ పట్టణంలోని బంజారా కాలనీ( Banjara Colony )కి చెందిన ఇందిర( Indira ) అనే మహిళా కార్యకర్త హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ఆర్థిక పరిస్థితి గురించి మంత్రికి వివరించారు. ఆమె ఆర్థిక పరిస్థితికి చలించిపోయిన మంత్రి.. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు.
ఈ సందర్భంగా ఇందిరతో పాటు ఆమె కూతురు, కుమార్తెకు మంత్రి శ్రీనివాస్ గౌడే స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి మంత్రి భోజనం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు. ఓ సాధారణ కార్యకర్త అయిన తన ఆవేదనను సాక్షాత్తు మంత్రి ఇంత ఓపికగా విని ఎంతో భరోసాను ఇచ్చినందుకు ఇందిర ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు.