మహబూబ్నగర్: సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో రూ.30 లక్షలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, ఆర్చరీ కోర్టులను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణ సమగ్ర అభివృద్ధియే కాకుండా క్రీడా అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రూ. 4 కోట్లతో ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. స్టేడియంలో సకల వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు.