మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హరితహారంలో (Haritha haram) భాగంగా జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి సెంట్రల్ డివైడర్పై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014కు ముందు ఎలాంటి అభివృద్ధికి నోచుకోని మహబూబ్నగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఊహించని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
వాతావరణ సమతుల్యాన్ని కాపాడటానికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. ప్రజలంతా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రజలు మొక్కలు నాటేలా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు చైతన్యం తీసుకురావాలన్నారు. ఇండ్ల నిర్మాణ సమయంలో ప్రతి ఇంటి ముందు ఐదు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాలని న్నారు.