Captain Amarinder Singh
మొహాలీ (పంజాబ్): ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఆయన మంగళవారం లేఖరాశారు. ‘నేను బీసీసీఐకి లేఖరాశా. రోజుకు 9వేల కరోనా కేసులు నమోదవుతున్న ముంబైలోనే మ్యాచ్లు నిర్వహిస్తున్నప్పుడు.. మొహాలీతో వచ్చిన సమస్యేంటి. మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అమరిందర్ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోనూ ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు లేకపోవడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో ఐపీఎల్ 14వ సీజన్ నిర్వహించనున్నట్టు షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.