హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాలు, తండాలకు మం డల కేంద్రాల నుంచి రోడ్ల అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పీఎంజీఎస్వై, ఉపాధిహామీ వంటి వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను పొంది సమర్థంగా వినియోగించాలని సూచించారు. గురువారం సె క్రటేరియట్లో పీఆర్ ఇంజినీరింగ్ శాఖపై మంత్రి సమీక్షించారు.
పంచాయతీరాజ్ పనులకు నాబార్డు నుం చి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాల ని మంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. నాసిరకమైన పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాఖాపరమైన సమస్యలు, పెండింగ్ బిల్లుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వరగా వాటిని పరిషరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, సీఈలు సీతారాములు, కనకరత్నం, శివకుమార్, అశోక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.