హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. ఆ రెండు పార్టీల నాయకులకు మహిళా రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా సాధికారతకు పెద్దపేట వేసిస బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు.
50 ఏండ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం ఎందుకు చేయలేకపోయిందో రేవంత్రెడ్డి సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డి ఏనాడూ పార్లమెంటులో గిరిజనులు, మహిళల హకులు, అభివృద్ధి కోసం కొట్లాడిన పాపాన పోలేదని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి.. మణిపూర్లో గిరిజన ప్రజలు అల్లర్లతో అగ్నికి ఆహుతి అవుతుంటే నిస్సిగ్గుగా తెలంగాణలో నీచ రాజకీయాలు చేశారు తప్ప, అక్కడికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పలేదని మండిపడ్డారు.