తిరుమల : తెలంగాణ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే సీఎం కేసీఆర్కు మరింత శక్తిని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి అంతరించి, తిరుమలకు గత వైభవం రావాలని ఆకాంక్షించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని తెలిపారు. ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన అత్యాశకు పోయి ఉప ఎన్నికలు తెచ్చారన్నారు.