వరంగల్: సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెతోపాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఉన్నారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ స్థానికంగా జరిగిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఆమెతోపాటు జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి, తదితర నేతలు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.