హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విజయ, గిరి బ్రాండ్ ఉత్పత్తులను గురువారం గురువారం శాసనసభ, మండలి సభ్యులకు అందజేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గిరిజన కో-ఆపరేటీవ్ కార్పొరేషన్ (జీసీసీ) ఉత్పత్తులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పంపిణీచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఉత్పత్తులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేయడం ఆనవాయితీ.