హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నాంపల్లిలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇంటర్, పాఠశాలల ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ లాక్డౌన్ పొడిగింపుతో ఆ సెలవులను జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. వేసవి సెలవుల గడువు సమీపిస్తుండటంతో విద్యాసంస్థల పునఃప్రారంభం, ఆన్లైన్ తరగతుల నిర్వహణపై చర్చిస్తున్నారు.