వికారాబాద్ : అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతూ తాండూరు రూపురేఖలు మారుస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులో కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి వృద్ధులు పిల్లలకు భారం కావొద్దని ఆలోచిస్తూ ఉంటారు.
వారికి ఆసరాగా వృద్ధాప్య పెన్షన్లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అందరికి ఆసరా పింఛన్లు అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా మారాడన్నారు. రాష్ట్రంలో46 లక్షల మందికి వివిధ కేటగిరీల పెన్షన్లు అందిస్తున్నాం.
మధ్యవర్తుల ప్రమేయం, అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు,మిషన్ భగీరథ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు.
అందరి సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు మీ దీవెనలు ఉండాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.