Cyber Security Course | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాలను అరికట్టడం, వాటిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సు అందుబాటులోకి వచ్చింది. సైబర్ సెక్యూరిటీ పేరిట రూపొందించిన ఈ కోర్సును సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తదితరులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మూల్యాంకన పద్ధతులపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) రూపొందించిన అధ్యయన నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్లో సైబర్ సెక్యూరిటీ నూతన కోర్సును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 30 శాతం ప్రజలు ఏదో ఒక సైబర్ క్రైమ్ బారినపడుతున్నారని చెప్పారు. ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్)ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కోర్సు విద్యార్థులను సైబర్ యోధులుగా తయారుచేస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసుశాఖ అదనపు డీజీ సంజయ్కుమార్జైన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్కే మహమూద్, పలు వర్సిటీల వీసీలు విజ్జులత, రవీందర్, గోపాల్రెడ్డి, పలు వర్సిటీల ఆచార్యులు పాల్గొన్నారు.
కోర్సు ప్రత్యేకతలివి..