మండుటెండలో కాళ్లకు చెప్పుల్లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులకు చెప్పులు, షూస్ ఇప్పించి మానవత్వం చాటారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్ దేవతల గుట్టలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూజలు చేసి వెళ్తుండగా ఆరుగురు విద్యార్థులు చెప్పులు లేకుండా మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి నడుచుకుంటూ వస్తుండడాన్ని ఆమె గమనించారు. వెంటనే ఆమె తన కాన్వాయ్ను ఆపారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆదేశాలతో టీఆర్ఎస్ బీసీ సెల్ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు నిమ్మల నరేందర్ ఆరుగురు విద్యార్థులకు చెప్పులు, షూస్ ఇప్పించారు.
— Namasthe Telangana (@ntdailyonline) April 17, 2022