హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత రాష్ర్టాలు డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు కావని, అవి ట్రబుల్ ఇంజిన్ రాష్ర్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బడి ము ఖం చూడని పిల్లలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర లాంటి ‘ట్రబుల్ ఇంజిన్’ రాష్ర్టాలు పోటీపడుతున్నాయని మంగళవారం ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. అందుకు సంబంధించి కేంద్ర ప్రభు త్వం పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలను తన ట్వీట్కు జోడించారు. ఉత్తరప్రదేశ్లో 3,96,655, గుజరాత్లో 1,06,885, బీహార్లో 1,34, 252, మధ్యప్రదేశ్లో 18,678, మహారాష్ట్రలో 15,707 మంది చిన్నారులు బడి బయట ఉన్నట్టు వివరించారు. రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా పెరిగిందని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సరస్వతీ నిలయంగా మారిందని మంత్రి సబిత పేర్కొన్నారు.