Puvvada ajay kumar | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 6: దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏకకాలంలో దశాబ్దాల కల నెరవేరేలా 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసి.. తెలంగాణలోని 1.50 లక్షల కుటుం బాలకు సీఎం కేసీఆర్ ‘పోడు’ బాంధవుడు అయ్యార ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొని యాడారు. గురువారం ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలోని రైతువేదికలో పోడు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి చెందిన 673 మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు పోడు రైతుల బాధలను పట్టించుకోలే దని, సీఎం కేసీఆర్ వారి గోడు విని ఏక కాలంలో పట్టాలు పంపిణీ చేసి దశాబ్దాల సమస్యను పరి ష్కరించారని తెలిపారు. పట్టాతో గిరిజనులకు రైతు బంధు, రైతుబీమాతోపాటు ఎనిమిది రకాల ప్ర యోజనాలు ఉంటాయని వివరించారు. నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా మామడ, సారంగాపూర్ పోడు పట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా అటవీ మంత్రి ఇంద్ర కరణ్రెడ్డి మాట్లాడుతూ.. పోడు రైతులకు రైతు బంధుతోపాటు త్రీఫేజ్ కరంట్, గిరివికాస్ పథకం కింద వందశాతం సబ్సిడీపై మోటర్లు అందిస్తా మని చెప్పారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను దేశంలోనే రోల్ మాడల్గా నిలిపారని గుర్తుచేశారు. మామడలో మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేశారు. వరంగ ల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కల పల్లె, గోవిందాపూర్, కొండాపూర్ ఏజెన్సీ గ్రామా ల్లో 300 మంది రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పోడు పట్టాలు పంపిణీ చేసిన సం దర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే పోడు భూము ల్లో కాళేశ్వరం జలాలను పారించి సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.