ఖమ్మం : జిల్లాలోని మధిర నియోజకవర్గం సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎర్రుపాలెంలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని తిరుగుప్రయాణంలో సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఆగారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు.
మధ్యాహన భోజనంపై విద్యార్థులను ఆరా తీశారు. టాయిలెట్స్, తాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక, హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో టైల్స్ పగిలిపోవడం గుర్తించిన మంత్రి తక్షణమే బాగుచేయలని ఆదేశించారు. వారి వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం