హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా అమరుల స్మారక చిహ్నం పూర్తి కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన క్లాడింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా, అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అమరుల త్యాగాలు ప్రతిబింబించే విధంగా ఫినిషింగ్ వర్క్ ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఈ నిర్మాణం. అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి ఆదేశించారు.
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలన్నారు. ఎలివేషన్, జీఆర్సీ క్లాడింగ్ పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రాండ్ ఎంట్రీ నిర్మాణం ఫినిషింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మూడు షిఫ్టుల్లో మ్యాన్ పవర్ పెంచి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.