హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ‘నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త..’ అంటూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. గుజరాత్కు గులాములుగా మారిన తెలంగాణ బీజేపీ నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని, అది నోరా..మోరా? అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రం ఇచ్చిన గణాంకాలను నయాపైసాతో సహా వివరించిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం ‘కుకతోక వంకర’ అన్నట్టు పదే పదే అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఢిల్లీ నేతలు చేసే సిల్లీ ఆరోపణలను తెలంగాణ ప్రజలు విశ్వసించబోరని చెప్పారు. బీఆర్ఎస్పై బురదజల్లడం ఆపి ప్రజల కోసం పాటుపడాలని, తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని హితవు పలికారు.
డబుల్ బెడ్రూం ఇండ్లపైన ఆరోపణలా?
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పేందుకు బీజేపీ నేతలకు సిగ్గుండాలని మంత్రి ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న ఇండ్లకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సరారు పైసలు ఇవ్వడం లేదని, కానీ అవార్డులు మాత్రం ఇస్తుందని నడ్డాకు అసలు తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 1,59,372 ఇండ్లకు.. ఒకో ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున రూ.2,390 కోట్లు ఆర్థికసాయం చేస్తామని చెప్పారని, కానీ ఇచ్చింది కేవలం రూ.1,201 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేసిన డబ్బులో ఇది కేవలం 10 శాతం మాత్రమేనని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకో ఇంటిని రూ.8,65,000 వ్యయంతో నిర్మిస్తుండగా.. పీఎంఏవై ద్వారా రూ.1.50 లక్షలు ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకూ సగం నిధులు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రధాన మంత్రి అవార్డు, హడో ఎక్స్లెన్స్ 2018, హడో ఎక్స్లెన్స్ 2019, నిర్మాణాల్లో నూతన టెక్నాలజీ ఉపయోగించినందుకు ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు 2020 సంవత్సరానికిగాను కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ ఎక్స్లెన్స్ అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు.
జాతీయ రహదారులకు అరకొర నిధులే!
తెలంగాణలో జాతీయ రహదారుల కోసం మోదీ ప్రభుత్వం కాగితాల మీద రూ.1.21 లక్షల కోట్లు మంజూరు చేసి.. తొమ్మిదేండ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.19 వేల కోట్లేనని ప్రశాంత్రెడ్డి తెలిపారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుంచి టోల్ ట్యాక్స్, సెస్ల ద్వారా ముకు పిండి వసూలు చేసిన పైసలేనని స్పష్టం చేశారు. కాగితాల మీద మంజూరు లెకలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు.. తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఈ సీజన్ వరకు రూ.72 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రైతుల పట్ల ఎవరి చిత్తశుద్ధి ఏమిటో రాష్ట్ర, కేంద్ర గణాంకాలు చూస్తే అర్థమవుతుందని తెలిపారు. రైతులపాలిటవరంగా మారిన ధరణిని రద్దు చేసి, మళ్లీ వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చి..మళ్లీ రైతులను గోసపెడదామనేదే బీజేపీ ఆలోచన అని మండిపడ్డారు. బీజేపీ మిడతల దండు అసత్య ఆరోపణలు.. ప్రచారాలపై ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.