సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్(Gajwel) పట్టణంలో పర్యటించారు. ప్రగ్ఞాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజ మాలతో స్వాగతం పలికాయి. అనంతరం మంత్రి గజ్వేల్ పట్టణంలోని తూముకుంట నర్సారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలివడితే 9వ తేదీన ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 ప్రారంభించామని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలతో ప్రారంభించామని పేర్కొన్నారు. గతం లో ఇచ్చిన విధంగానే రైతు బందు ఇస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.