హైదరాబాద్ : రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.సెలూన్(Salons), లాండ్రీ, ధోబీఘాట్లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు. ఎవరు అధైర్యపడవద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని(free electricity) అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక శాఖ బడ్జెట్ను విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.