హైదరాబాద్ : మేము నాయకులం కాదు సేవకులమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో(Manuguru) సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేసిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యాన్ని కాంక్షిస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని పేర్కొన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన గ్యారంటీలను(Six Guarantees) తప్పకుండా నెరవేర్చుతామని తెలిపారు.