హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనేక విజయాలు సాధించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తూచ తప్పకుండా అమలుచేస్తూ విజయవంతంగా ముం దుకు సాగుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల్లో తాము సాధించిన విజయాలంటూ పలు అంశాలను పేర్కొన్నారు.