హైదరాబాద్ : ప్రజాపాలన(Prajapalana)లో వచ్చిన దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన డేటాలో ఎంట్రీ(Data entry) చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy) అన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. వందరోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ దరఖాస్తులు స్వీకరించామని పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల డాటా ఎంట్రీ చేస్తామని మంత్రి తెలిపారు.