గత ఏడాది 13 శాతం బాయిల్డ్ రైస్.. 5 శాతం నూకల ఎగుమతులు..
స్వయంగా వెల్లడించిన కేంద్ర సర్కార్
తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు డబ్ల్యూటీవో ఆంక్షలా?
బియ్యం ఎగుమతులపై గోయల్ బొంకు
తెలంగాణ నుంచి ఎందుకు కొనరు?
ఎగుమతికి వీలున్నా చేయరెందుకు?
‘మనదేశం నుంచి బియ్యం ఎగుమతులపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఆంక్షలున్నాయి. కాబట్టి బాయిల్డ్ రైస్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం లేదు..’
ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ఆహార ప్రజాపంపిణీశాఖ మంత్రి పీయూష్గోయల్ రాజ్యసభలో చెప్పిన మాటలివి.
‘2020-21లో దేశం నుంచి 1.30 కోట్ల టన్నుల నాన్ బాస్మతి బియ్యాన్ని (ఇందులో 12.99% బాయిల్డ్ రైస్) ఎగుమతిచేశాం. దీని విలువ రూ.35,476 కోట్లు. 2021-22లో అక్టోబర్ వరకు రూ.25,582 కోట్ల విలువైన 96 లక్షల టన్నుల
నాన్ బాస్మతి బియ్యాన్ని ఎగుమతిచేశాం.’
కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడ) వెల్లడించిన వివరాలివి.
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): ‘మనదేశం నుంచి బియ్యం ఎగుమతులపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఆంక్షలున్నాయి. కాబట్టి బాయిల్డ్ రైస్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం లేదు..’
ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ఆహార ప్రజాపంపిణీశాఖ మంత్రి పీయూష్గోయల్ రాజ్యసభలో చెప్పిన మాటలివి.
‘2020-21లో దేశం నుంచి 1.30 కోట్ల టన్నుల నాన్ బాస్మతి బియ్యాన్ని (ఇందులో 12.99% బాయిల్డ్ రైస్) ఎగుమతిచేశాం. దీని విలువ రూ.35,476 కోట్లు. అదేవిధంగా 2021-22లో అక్టోబర్ నెలవరకు రూ.25,582 కోట్ల విలువైన 96 లక్షల టన్నుల నాన్ బాస్మతి బియ్యాన్ని ఎగుమతిచేశాం.’
కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడ) వెల్లడించిన వివరాలివి.
సీదా ప్రశ్న
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం? ఏది అబద్ధం? ఓ పక్క బాయిల్డ్ రైస్ కొనకుండా ఉండటానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీశాఖ మంత్రి పూటకో సాకును వెతుక్కొని మరీ చెప్తుంటే.. అదే కేంద్రంలోని మరోశాఖ ఇంకో లెక్కలు చెప్తున్నది. లెక్కలు ఎప్పుడూ తప్పు చెప్పవు. గోల్మాల్ చేస్తున్నదల్లా గోయలేనని సామాన్య రైతుకు కూడా అర్థమవుతున్నది. ఏడాదికాలంగా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణతో డబుల్గేమ్ అడుతున్నది. మొన్నమొన్నటిదాకా.. గోదాముల్లో నాలుగేండ్లకు సరిపడా ఫుల్లుగా బియ్యం ఉన్నయని చెప్పారు. తరువాత మీరివ్వట్లేదని నెపం నెట్టారు. ఆ తరువాత రా రైస్ అయితే తీసుకొంటమన్నరు. ఇవన్నీ నిజంకాదని తేలేసరికి.. బియ్యం ఎగుమతులపై ఆంక్షలున్నాయంటున్నారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు నుంచి తప్పించుకొనేందుకే పీయూష్ గోయల్ పచ్చి బూటకపు వ్యాఖ్యలు చేసినట్లు తేలిపోయింది. గోయల్.. గిదేంది?
13 శాతం బాయిల్డ్ రైస్ ఎగుమతి…
2020-21లో మొత్తం ఎగుమతి చేసిన నాన్ బాస్మతి బియ్యంలో బాయిల్డ్ రైస్ వాటానే అధికంగా ఉన్నది. 12.99 శాతం బాయిల్డ్ రైస్ను దేశం నుంచి ఇతర దేశాలకు కేంద్రం ఎగుమతి చేసింది. అదేవిధంగా నూకలను (బ్రోకెన్ రైస్) 5.27 శాతం, ఇతర బియ్యాన్ని 3.65 శాతం ఎగుమతి చేసింది. బాయిల్డ్ రైస్ను ఇంత పెద్ద మొత్తంలో ఎగుమతిచేస్తున్న కేంద్రం మరోవైపు తమకు ఎగుమతులకు అవకాశం లేదంటూ తప్పించుకొంటున్నది.
ఆంక్షలుంటే ఎగుమతి ఎలా సాధ్యం?
బాయిల్డ్ రైస్ ఎగుమతులపై తమకు ఆంక్షలున్నాయంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం బియ్యం ఎగుమతులపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఆంక్షలుంటే అపెడ చెప్పిన లెక్కల మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతేడాది 12.99 శాతం బాయిల్డ్ రైస్ ఎగుమతి ఎలా సాధ్యమైందో గోయల్ జవాబివ్వాలని తెలంగాణ రైతు సమాజం డిమాండ్ చేస్తున్నది. తెలంగాణలో పండించే బాయిల్డ్ రైస్కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నది. ఎగుమతులకు పుష్కలమైన అవకాశాలున్నాయి. కానీ, ఆ దిశగా కేంద్రం దృష్టి పెట్టడం లేదు.
నాన్-బాస్మతికే ఎక్కువ డిమాండ్…
ఎగుమతుల్లో బాస్మతి బియ్యంతో పోల్చితే నాన్-బాస్మతి (ఎక్కువ భాగం బాయిల్డ్ రైస్) బియ్యానికే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు కేంద్రం వెల్లడించిన గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. 2020-21లో దేశం నుంచి మొత్తం రూ. 65,325 కోట్ల విలువైన 17.72 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో నాన్-బాస్మతి బియ్యం 13.09 మిలియన్ టన్నులు కాగా బాస్మతి బియ్యం కేవలం 4.63 మిలియన్ టన్నులు మాత్రమే. ఎగుమతైన బాస్మతి బియ్యం విలువ రూ.29,849 కోట్లు కాగా నాన్-బాస్మతి బియ్యం విలువ రూ.35,476 కోట్లు కావడం గమనార్హం.
నూకల ఎగుమతికీ డిమాండ్..
అంతర్జాతీయ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు మాత్రమే కాదు.. నూకలకు (బ్రోకెన్ రైస్) కూడా భారీ డిమాండ్ ఉంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రం నూకలను కూడా ఎగుమతి చేస్తున్నది. నిరుడు ఎగుమతి అయిన నాన్-బాస్మతి బియ్యంలో బాయిల్డ్ రైస్ తర్వాత అధిక వాటా నూకలదే కావడం గమనార్హం. మొత్తం ఎగుమతుల్లో 5.27 శాతం నూకలను ఎగుమతి చేసింది. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్వింటాలు నూకల ధర రూ.1600-1700 ఉండగా ప్రస్తుతం అది రూ.2200 కు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు, నూకలకు ఇంత డిమాండ్ ఉంటే.. కేంద్రం మాత్రం ఎగుమతులకు అవకాశమే లేదంటున్నది.