ఖమ్మం : ఖమ్మం నగరంలో జనవరి 2న జరగాల్సిన మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడిందని, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించ తలపెట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరో తేదీకి వాయిదా వేశామని పేర్కొన్నారు. తదుపరి తేదీని మళ్లీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
కాగా, సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పర్యటన యథాతదంగా కొనసాగనుంది. ఆయా కార్యక్రమలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే పాల్గొంటారు.