హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ ప్రవర్తన లోక్సభలోనే ఇలా అసభ్యంగా, దారుణంగా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఉహించుకుంటేనే వణుకుపుడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.
లోక్సభ స్పీకర్ ఈ అసంబద్దతను అనుమతించడం మరింత దిగ్భ్రాంతికరం, అవమానకరమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ లోక్సభలో చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందించారు.