హైదరాబాద్ : కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ – లక్డీకాపూల్, నాగోల్ – ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు, కూడా నిధులు ఇవ్వాలని కోరారు. మెట్రో రెండో విడుత ప్రాజెక్టుకు రూ. 8,453 కోట్లు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులను కేటాయించాలని కోరారు. 2023-24 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.