హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్తకాలను అందజేస్తారు. అనంతరం నారాయణపే జిల్లాలో రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నారాయణపేటలో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్కు భూమి పూజ చేడయంతోపాటు ప్రజల దాహార్తిని తీర్చే దుకు రూ.29.59 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌస్ను ప్రారంభింస్తారు. కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
ఉదయం 11 గంటలకు నారాయణపేటకు చేరుకుంటారు. సింగారం వద్ద మిషన్ భగీరథ పంప్ హౌస్, అక్కడే సబ్ స్టేషన్ను ప్రారంభిస్తారు.
11.30 గంటలకు ఆరో వార్డులో రూ.1.20కోట్లతో నిర్మించనున్న పార్కు నిర్మాణం కోసం శంకుస్థాపన, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ పార్కు వద్ద రూ.20 కోట్లతో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్కు భూమిపూజ, రూ. 6.65కోట్లతో మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన.
ఉదయం 11.50 గంటలకు ఎర్రగుట్ట వద్ద రూ. 2కోట్లతో జిల్లా గ్రంథాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన, రజకుల కోసం రూ. కోటితో చేపట్టే ఆధునిక లాండ్రీకి భూమిపూజ.
మధ్యాహ్నం 12.15 గంటలకు పాత బస్టాండ్ వద్ద రూ.1.35 కోట్లతో నిర్మించిన నాన్వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవం. రూ.కోటి నిధులతో చేపట్టే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ.
మధ్యాహ్నం 12.45 గంటలకు రూ.12 కోట్లతో పట్టణంలో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు, మధ్యాహ్నం ఒంటి గంటకు రూ.4 కోట్ల నిధులతో కొండారెడ్డి పల్లి చెరువును మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసే పనులకు భూమిపూజ చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు రూ.1.10 కోట్లతో పేరపళ్ల రోడ్డులో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తారు. బారంబావి సమీపంలో రూ.87.45 లక్షలతో మిషన్ వస్ర్తాలయ పథకం కింద నిర్మించనున్న చైల్డ్ హోం పనులకు భూమిపూజ. 3 గంటలకు నారాయణపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.