KTR | హైదరాబాద్ : తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతున్నది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో మూడమూచ్చటగా ఉన్నది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్లే సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు.. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం.. సకల జీవరాశులను సంరక్షించడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ది అని పేర్కొన్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా.. ఈ గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో.. భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు అని పేర్కొంటూ కేటీఆర్ తన ట్వీట్ ముగించారు.
మానవ నిర్మిత అద్భుతమైన
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే కాదు..
ప్రపంచంలోనే గ్రీన్ కవర్ పెంచే..
మూడో అతిపెద్ద మానవ ప్రయత్నానికి కేరాఫ్ అడ్రస్
మన తెలంగాణ.భవిష్యత్తు తరాలకు
మనమిచ్చే వారసత్వ సంపద
కాంక్రీట్ జంగిళ్లు కాదు.. పచ్చని అడవులని
సమస్త ప్రజానీకానికి గుర్తుచేసిన… pic.twitter.com/hvU3yGWiwf— KTR (@KTRBRS) June 19, 2023