KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పంచాయతీలకు ప్రతి నెల నిధులు మంజూరు చేయడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా పంచాయతీలకు కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లో మన తెలంగాణ పల్లెలు అగ్రభాగాన నిలుస్తున్నాయి. ఇప్పటికే అనేక అవార్డులను తెలంగాణ గ్రామాలు అందుకుని, ఇతర రాష్ట్రాల్లోని పల్లెలకు ఆదర్శంగా నిలిచాయి.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న.. మహాత్మా గాంధీ ఆశయమే స్ఫూర్తిగా.. సీఎం గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు. పల్లె ప్రగతికి ప్రాణం పోశారని కేటీఆర్ కొనియాడారు. నాడు.. దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లె.. నేడు.. దర్జాగా కాలర్ ఎగరేస్తోంది అని అభిప్రాయపడ్డారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు.. ఇవాళ సకల సౌకర్యాలతో వెలిగిపోతోందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లె సీమ.. ప్రగతిసీమగా మారిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఆదర్శ గ్రామాలకు… కేరాఫ్ అడ్రస్
అవార్డుల పంటకు నిలువెత్తు చిరునామా
యావత్ భారతావనిలో.. ఒకేఒక్క తెలంగాణపల్లె కన్నీరు పెడుతుందో..
అని పాడుకున్న దుస్థితి నుంచి..మురిసింది నా పల్లె సీమ…
ముస్తాబై మెరిసింది నా పల్లె సీమ…
అని
సగర్వంగా పాడుకునే వరకు సాగిన ఈ మహాయజ్ఞంలో… pic.twitter.com/pwEQHCmAho— KTR (@KTRBRS) June 15, 2023