Minister KTR | రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తుంది ప్రభుత్వం. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
ప్రతి తరగతి గది.. తరగని విజ్ఞాన గని..
ఆ నాలుగుగోడలే.. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలు..
ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. అక్షరాలా ఆచరించింది తెలంగాణ ప్రభుత్వం..
తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవం..
యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోంది తెలంగాణ ప్రభుత్వం .
మిగతా రాష్ట్రాల్లో డ్రాప్ అవుట్లు
తెలంగాణలో మాత్రం డ్రాప్-ఇన్లు
కేవలం ఒక ఏడాదే..
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు..
కొత్తగా లక్షకు పైగా విద్యార్థుల బలమైన అడుగులు
వ్యవసాయంలోనే కాదు..
విద్యారంగంలోనూ వలసలు వాపస్
రేపటి పౌరుల భవిష్యత్తుపైనే
ప్రభుత్వ ఫోకస్ దేశ చరిత్రలోనే
అత్యధిక గురుకులాలు కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలు
ఒకో విద్యార్థిపై రూ.లక్షా 25 వేల వ్యయం
భారంగా కాదు.. బాధ్యతగా భావిస్తోంది మన ప్రభుత్వం.
మన ఊరు-మన బడితో సమూల మార్పులు
26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు
సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనమైనా..
సరారు బడిలో ఇంగ్లిష్ మీడియం బోధనైనా..
ప్రతి ఆలోచన విప్లవాత్మకం..
ప్రతి నిర్ణయం ప్రతిష్ఠాత్మకం..
మన భావితరాలకు బంగారు బాటలేసే..
ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ…
మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సేవలు అందిస్తున్న
ఉద్యోగులకు యావత్ అధికార యంత్రాంగానికి..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!
అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మన ఊరు-మన బడితో సమూల మార్పులు చేశామన్నారు. 26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు వచ్చాయన్నారు. మన భావితరాలకు బంగారు బాటలేసే.. ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ… మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
మన ఊరు-మన బడితో సమూల మార్పులు
26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలుసన్నబియ్యంతో విద్యార్థులకు భోజనమైనా..
సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం బోధనైనా..
ప్రతి ఆలోచన విప్లవాత్మకం..
ప్రతి నిర్ణయం ప్రతిష్ఠాత్మకం..మన భావితరాలకు బంగారు బాటలేసే..
ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ…
మనసుపెట్టి… pic.twitter.com/WNvc7NilBY— KTR (@KTRBRS) June 20, 2023