KTR | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కారం పొడి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సంవత్సరానికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటిస్థానంలో ఉందని తెలిపారు. రెండు మిర్చి ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్రంగా మహబూబాబాద్ తయారైందన్నారు. తెలంగాణ మొత్తంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటను పరిశీలిస్తే, ఒక్క మహబూబాబాద్ జిల్లా నుంచే 25 శాతం ఉత్పత్తి అవుతుందన్నారు. ఇక్కడ్నుంచి ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన మిర్చికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని కేటీఆర్ తెలిపారు.
ఇక జిల్లాకు చెందిన మిరప రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో.. రెండు చిల్లి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని, ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కురవి మండలంలో రూ. 70 కోట్లతో ప్లాంట్ లిపిడ్స్ పేరిట, మరిపెడ మండలంలో విద్యా హెర్బ్స్ రూ. 50 కోట్లతో చిల్లి ప్రాసెసింట్ యూనిట్లను నెలకొల్పింది. ఈ రెండు యూనిట్లు రోజుకు 150 మెట్రిక్ టన్నుల మిర్చిని ప్రాసెస్ చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ యూనిట్ల ఏర్పాటుతో రైతులకు 10 నుంచి 20 శాతం వరకు ఆదాయం పెరిగింది. ఇప్పటి వరకు ప్లాంట్ లిపిడ్స్ రూ. 100 కోట్ల విలువైన సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల మిర్చిని సేకరించింది.
Sharing a success story of industrialisation in rural Telangana
✳️ Mahbubabad in one of the highest chilli producing districts in Telangana with an annual production of approx. 1.5 lakh MTs (approx. 25% of the total Telangana’s production). Further, the quality of the chilli… pic.twitter.com/Hsvwph0IPR
— KTR (@KTRBRS) July 2, 2023