Loksabha Elections 2024 : దేశంలో లోక్సభ ఎన్నికలకు రెండు దశల పోలింగ్ అనంతరం 190 స్ధానాలకు పోలింగ్ ముగియగా వీటిలో విపక్ష ఇండియా కూటమి 120 నుంచి 125 స్ధానాలను గెలుచుకుంటుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఏర్పాటులో ఆప్ కీలక పాత్ర పోషిస్తుందని, ఆప్ లేకుండా తదుపరి కేంద్ర ప్రభుత్వం కొలువు తీరడం సాధ్యం కాదని, భవిష్యత్ను తమ పార్టీ నిర్ధేశిస్తుందని మాన్ పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం మౌలిక వసతుల ఏర్పాటులో ఆప్ చొరవ చూపుతుందని చెప్పారు.
దేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలిపేలా తాము దిశానిర్ధేశం చేస్తామని తెలిపారు. పంజాబ్ అగ్రభాగాన నిలిచిన రోజున దేశం కూడా అభివృద్ధిలో పురోగమిస్తుందని అన్నారు. పంజాబ్లోని అన్ని స్ధానాల్లోనూ ఆప్ అభ్యర్ధులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్లో కమలం వికసించే ప్రసక్తి లేదని మాన్ పేర్కొన్నారు.
Read More :
Gajwel | ఇది ఐలవ్వ మాట.. ఇప్పుడే ఎలచ్చన్ పెడితే కేసీఆరే అస్తడు