KTR | హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత కంటి నిండా నిద్రపోయానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు తమకు శుభవార్తను చెబుతాయని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ శాసనసభకు గురువారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన అనంతరం నిన్న సాయంత్రం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 2018లోనూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ఇచ్చారని, 5 ఎగ్జిట్పోల్స్లో ఒక్కటి మాత్రమే కరెక్ట్ అని, మిగిలిన నాలుగు తప్పేనని చెప్పారు. 2018లో బీఆర్ఎస్కు 48 సీట్లు వస్తాయని ఒక ఎగ్జిట్పోల్ చెప్తే, 50 సీట్లు గెలుస్తారని మరొకరు, 52 వస్తాయని ఇంకొకరు, 66 సీట్లు వస్తాయని వేరొకరు చెప్పారని, అవన్నీ తప్పయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో ఎగ్జిట్పోల్స్ తప్పని నిరూపిస్తూ బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ 69-72 స్థానాల్లో విజయం సాధిస్తుందని తనకు కూడా ఒకరు ఎగ్జిట్పోల్స్ ఫలితాలు పంపారని, తాను దాన్ని కూడా అంగీకరించనని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.
After a long time had a peaceful sleep 😴
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR
— KTR (@KTRBRS) December 1, 2023