KTR | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్తు దేశం కొనియాడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జలదృశ్యంలో ఒకరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిందని అన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గులాబీ శ్రేణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ సందేశం ఇచ్చారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు యావత్తు తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ కార్యశ్రేణుల పట్టుదల వల్లే తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన బీఆర్ఎస్ జెండా నేడు సమున్నతంగా ఢిల్లీలో రెపరెపలాడిందని అన్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా.. ఇప్పుడు దశాబ్దాలపాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించేందుకు హస్తినలో అడుగుపెట్టిందని తెలిపారు. ఉద్యమ పాఠాల నుంచి మొదలుకొని యావత్తు దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసీఆర్కే దకిందని పేర్కొన్నారు. ఈ మహాప్రస్థానంలో బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని, అధికార పార్టీగా తీసుకొన్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని స్పష్టం చేశారు.
గోల్మాల్ గుజరాత్ మాడల్ పనికిరాదని దేశప్రజలు గ్రహించిన నేపథ్యంలో గోల్డెన్ తెలంగాణ మాడల్పైనే చర్చ జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి ఒక గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదంతొకాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మార్మోగుతున్నదని వెల్లడించారు. తెలంగాణ సాధనకోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో దేశంకోసం కదం తొకాలని, ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.