భోపాల్ : హరిద్వార్లో కుంభమేళాలో పాల్గొని మధ్యప్రదేశ్కు తిరిగివచ్చిన వారిలో 99 శాతం మందికి కొవిడ్19 పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ పరిణామం అధికారులకు కలవరం కలిగిస్తోంది. హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా కొవిడ్ సూపర్ స్ప్రెడర్ అనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇందులో పాల్గొని వచ్చిన 61 మంది యాత్రికులకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కుంభమేళాలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చిన వారిలో మరికొందరిని ఇంకా గుర్తించకపోవడంతో వారి ద్వారా వైరస్ సంక్రమణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కొవిడ్-19 కేసులు ప్రబలమవుతుండటంతో కుంభమేళా నుంచి తిరిగివచ్చిన యాత్రికులు 14 రోజులు విధిగా క్వారంటైన్లో ఉండాలని పలు రాష్ట్రాలు నిర్ధేశించాయి.