సదాశివపేట, జూలై 7 : సంగారెడ్డి ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు టీఆర్ఎస్లోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. సదాశివపేట ఎంపీపీతో పాటు మరో ఆరుగురు సర్పంచ్లు టీఆర్ఎస్లో చేరనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కాంగ్రెస్ను వీడి కారెక్కెందుకు ఈ నెల 6వ తేదీన మంత్రి హరీశ్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో మం తనాలు జరినట్లు తెలిసింది. టీఆర్ఎస్లో చేరితే వారికి సముచిత స్థానం కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి హామీఇచ్చినట్లు సమాచారం. సదాశివపేట ఎంపీపీ తొంట యాదమ్మతో పాటు మాజీ ఎంపీపీ కుమారుడు వెల్టూరు గ్రామ సర్పంచ్ పబ్బతి లక్ష్మారెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారు. వారితో పాటు మండలంలోని నందికంది, పెద్దాపూర్, నాగ్సాన్పల్లి, అంకెనపల్లి, కోనాపూర్ గ్రామాల సర్పంచ్లు మంతనాలు జరిపిన వారిలో ఉన్నారు. వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
‘పేట’లో ఖాళీ కానున్న కాంగ్రెస్..
సదాశివపేట మండలంలో పెద్ద గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలిచిన నాటి నుంచి ప్రజా ప్రతినిధులతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండ డం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న వారి గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ సర్పంచ్లుగా గెలిచిన గ్రామాల్లో అమలవుతున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒరిగేదేమిలేదని గెలిచిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ టీఆర్ఎస్లో చేరుతుండడంతో సదాశివపేట కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ కానున్నది. ఈ నెల 10వ తేదీన మంత్రి హరీశ్రావు సమక్షంలో సదాశివపేటలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలి సింది. కాంగ్రెస్ ఎంపీపీ, సర్పంచ్లు టీఆర్ఎస్లో చేరేందుకు వెల్టూర్ సర్పంచ్ లక్ష్మారెడ్డి కీలకంగా మారినట్లు తెలిసింది. పూర్తిగా కాంగ్రెస్ ‘పేట’లో కనుమరుగు కానున్నది. టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగనున్నది.