KTR | టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు కేటీఆర్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే రూ.100కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.
లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్తో పాటు కార్యాలయానికి సంబంధం ఉందని రేవంత్రెడ్డి, బండి సంజయ్ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడంతో పాటు మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు ఐటీ శాఖను నిర్వహిస్తున్న కేటీఆర్ పేపర్ లీకేజీ బాధ్యత వహించాలన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ నేతలిద్దరూ పేపర్ లీకేజీ వ్యవహారంలో దురుద్దేశంతో ఆరోపణలు చేశారని నోటీసులు మంత్రి ఆరోపించారు. లీక్ కేసులో తన పేరును ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతోకాలంగా ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలనే దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్దాలు చెబుతున్నారని, కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే లేదంటూ ఐపీసీ 499, 500 నిబంధనల ప్రకారం.. పరువు నష్టం కింద నోటీసులు పంపారు. ప్పటికైనా ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రూ.100కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.