హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. అందుకే ‘ఒక్క కేసీఅర్ (CM KCR) సారు ఉంటే చాలు.. తమకు అదే పదివేలు’ అని రైతుల మనోగమతమని తెలిపారు. వేరేటోళ్లను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని చెప్పారు.
అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా సాధారణ రైతులతోపాటు కౌలు రైతులకూ పరిహారం అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు మేలు చేకూర్చేందుకు 2015 నాటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన జీవోనూ సవరిస్తామని మేలు చేస్తామని వెల్లడించారు. పలుచోట్ల రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
BRS అంటేనే..
భారత " రైతు " సమితిఒక్క
తెలంగాణలోనే
మన అన్నదాతకు…
పెట్టుబడికి రూ.పదివేలు
పంట నష్టపోతే రూ.పదివేలుఅందుకే
మన రైతన్న మనోగతం
" ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు…
మాకు అదే పదివేలు… "వేరేటోళ్ళను
పొరపాటున నమ్మినా…
తెలంగాణ మళ్ళీ వెనక్కి.. వందేళ్లు pic.twitter.com/FyjjGIaIug— KTR (@KTRBRS) March 24, 2023