హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవచిస్తున్న ‘అమృత్ కాల్’ పదానికి ‘ఏ మిత్ కాల్’ పదం సరిగా సరిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ ద్వారా నెటిజన్లను కోరారు.
బీజేపీ రాష్ర్టాల మధ్యే వివాదం పరిష్కరించలేదు కానీ..రెండు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించలేని ప్రధాని మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాడంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బెళగావి సరిహద్దు వివాదం కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కొనసాగుతున్నదని, ఈ రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని, ఆ సమస్య ఇంతవరకు పరిష్కరించ లేదని గుర్తుచేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక ప్రహసనమని విదేశీ వ్యవహారాల శాఖ చెప్తుండగా నడ్డా అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ట్వీట్ చేశారు.