హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కంటే ముందగానే సోదాలు చేసేవారి పేరు చెబుతున్నారంటూ విమర్శించారు. ఎన్ఐఏ కంటే ముందే బ్యాన్ విధిస్తున్నారని, ఐటీ అధికారుల కంటే వేగంగా నగదు వివరాలు చెబుతున్నారని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు చెబుతున్నారన్నారు. భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్ఐఏ-ఈడీ..పీగా పేరు మార్చుకోవాలంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ 15లోపు షెడ్యూల్ వస్తుందని, ఐదెంచెల వ్యూహంతో విజయం సాధించాలని బీజేపీ స్టీరింగ్ కమిటీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలనుద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన వార్తను కేటీఆర్ ట్యాగ్ చేశారు.
Before “EC”
BJP announces
The Poll Dates!Before “ED”
BJP announces
The Names!Before “NIA”
BJP announces
The Ban!Before “IT”
BJP announces
The Amount!Before “CBI”
BJP announces
The Accused!Appropriately BJP should rename itself as;
“BJ…EC-CBI-NIA-IT-ED…P” pic.twitter.com/ZvwFlJW03w
— KTR (@KTRTRS) October 2, 2022