హైదరాబాద్ : అభివృద్ధి చెందిన ఖమ్మం నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా పని చేయాలని నూతనంగా ఎన్నికైన మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు సూచించారు. హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నూతన మేయర్, ఉప మేయర్లు మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
మంత్రి పువ్వాడ అజాయ్ కుమార్ ఆధ్వర్యంలో నగరం చాలా అభివృద్ధి చెందిందని, దానిని కొనసాగింపుగా మీ వంతు కృషి చేసి మరింత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.