హైదరాబాద్ : రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడుతున్న విషయం విదితమే. పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ ఎనిమిదేండ్ల మోదీ పాలనలో రూ. 26,51,919 కోట్లను ఇంధన ట్యాక్స్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే ఇండియాలో సుమారు 26 కోట్ల కుటుంబాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సగటున ప్రతి ఫ్యామిలీ నుంచి ఇంధన ట్యాక్స్ల రూపంలో రూ. 1,00,000 వరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని చిదంబరం పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇంధన పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించినప్పుడు, తిరిగి ప్రతి కుటుంబానికి ఏం ఫలితం వచ్చిందో మీరే ప్రశ్నించుకోవాలని ప్రజలను ఉద్దేశించి చిదంబరం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేసి కేంద్ర విధానాలను తప్పుబట్టారు.
Ask yourself, what did an average family get in return for paying this huge amount as fuel tax?
For more information read my column in the Indian Express dated 3-4-2022 or its online version
— P. Chidambaram (@PChidambaram_IN) April 3, 2022