Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( secunderabad railway station )వద్ద రాత్రి సమయంలో మహిళలకు సురక్షితమైన రవాణాను(ఆటో లేదా క్యాబ్) ఏర్పాటు చేయాలని కోరుతూ హర్షిత అనే ఓ నెటిజన్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( KTR )కు ట్వీట్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ( Public Transport ), మెట్రో( Metro ) సర్వీసులు అందుబాటులో లేని సమయంలో(రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు) పోలీసులు లేదా ఏదైనా గవర్నమెంట్ అథారిటీ ద్వారా ఆటో, క్యాబ్లకు ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ట్వీట్ను ఆమె కేటీఆర్కు ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్పై కేటీఆర్ తక్షణమే స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ డీజీపీ( Telangana DGP )కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మీ విలువైన సూచనను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని, మీరు సూచన చేసినందుకు ధన్యవాదాలు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కేటీఆర్ ట్వీట్పై డీజీపీ కూడా క్షణాల్లోనే స్పందించారు. తప్పకుండా మహిళలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాకింగ్ వ్యవస్థను కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. కార్యాచరణ అమలు కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తామని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. దీంతో కేటీఆర్ అంజనీ కుమార్కు థ్యాంక్స్ చెప్పారు.
Request @TelanganaDGP to consider this at the earliest and institute such mechanism at all Railway and Bus stations across the state
Thank You Harshitha Garu for your suggestion https://t.co/KwBqJ1krXq
— KTR (@KTRBRS) March 10, 2023