హైదరాబాద్ : పరిశ్రమల విషయంలో గతంలో గుజరాత్, మహారాష్ట్ర కర్నాటక వంటి రాష్ట్రాలు ముందుండేవని, ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సులభతర వాణిజ్యంలో ఎక్కువసార్లు రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్ల పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై.. 19 కేటగిరిల్లో రాణించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగ విషయంలో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువా ఉంటే అంత మంచిదని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఐపాస్లో కీలక నిబంధనలు పొందుపరిచినట్లు తెలిపారు. దేశంలో ప్రాంతాలను బట్టి ఆయా భాష మాట్లాడుతుంటారనీ, భాషను బట్టి ప్రతిభను అంచనా వేయొద్దన్నారు.
సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం తరహాలోనే పెట్టుబడులకు రాష్ట్రంలో స్వీయ ధ్రువీకరణ హక్కు కల్పించినట్లు పేర్కొన్నారు. చట్టప్రకారం మా వ్యాపారం చేసుకుంటామని ఎవరైనా స్వీయ ధ్రువీకరణ ఇస్తే చాలని, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు అవసరం లేకుండా తొలిరోజు నుంచే పరిశ్రమలను ప్రారంభించుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని దేశంలో ఏ రాష్ట్రం చెప్పదని, ప్రభుత్వ మద్దతు అంటే ఈ తరహా సాధికారతను కల్పించడమేనన్నారు. దీన్ని మా ముఖ్యమంత్రి చేశారని కేటీఆర్ అన్నారు.
IT and Industries Minister @KTRTRS presented the @FTCCI Excellence Awards to industry leaders, and entrepreneurs in Hyderabad. Industries Dept. Principal Secretary @jayesh_ranjan was also present. pic.twitter.com/clZZSeVzO8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 4, 2022